ప్రతీ మనిషిలో ఎంతో కొంత కోపము ఉంటుంది. లోపలెక్కడో దాగి ఉన్న అహము కోపము రూపంలో బుస్సుమని బయటకు వస్తుంది. మనకు చేటు కలిగించే కోపాన్ని తగ్గించుకోవాలి. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనము క్షమాగుణము కలిగిఉంటే మనచుట్టూ ఉన్నవాళ్ళు అందరు మంచిగా కనిపిస్తారు. మనిషికి క్షమాగుణాన్ని మించిన సుగుణము మరియొకటి లేదు. అనాది కాలము నుండి సాధువులు, సత్పురుషులు క్షమే రక్ష అని ఎన్నో విధాలుగా మనకు తెలియచేస్తూనే ఉన్నారు. దీన్ని సుమతి శతకములో మనసుకి హత్తుకునేలా వివరించారు......
"తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష
తన సంతోషమే తన స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి!"
కోపము మనకు శత్రువు. క్షమాగుణము కలిగినవాళ్ళు అదృష్టవంతులు , ఓర్పు లేనప్పుడు ఎంత చేసినా ప్రయోజనము ఉండదు. మనలను రెచ్చగొట్టే విధంగా ఉంటాయి కొందరి మాటలు, చేష్టలు అలాంటి సందర్భము ఏర్పడినప్పుడు మనము నిగ్రహంగా ఉండాలి. ఎదుటివాళ్ళను క్షమించడమంటే అది మన మనసుపై మనము సాధించిన విజయము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి