పేజీలు

20, అక్టోబర్ 2009, మంగళవారం

మహాత్ముల సూక్తి రత్నావళి.

ప్రపంచంలో ఎన్నో విధాలైన యుద్ధాలుంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటినీ మించిన మహా సంగ్రామం లాంటిది.........స్వామి శివానందుడు.

వైరం అంతమయ్యేది మృత్యువు తోనే..........వాల్మీకి.

తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన వాటికి ప్రతిఫలం ఈ సృష్టి లోనే లేదు.......వాల్మీకి.

సంతృప్తి  అనే వంతెన విరిగి పోయిందంటే, ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు, ఆపూ వుండవు........ప్రేంచంద్.

మంచి పనులు చేసేవారు ఎంత గొప్పవారైనా, వారి గురుంచి పూర్తిగా తెలిసేదాకా, ప్రజలు వారు చెప్పేది ఒక్క ముక్కైనా వినరు......వినోభాభావే.

కోపం యమధర్మరాజు లాంటిది, తృష్ణ వైతరిణి లాంటిది, విద్య కామధేనువు లాంటిది. ఇక, సంతృప్తి దేవరాజైన ఇంద్రుని నందనవనం లాంటిది........చాణక్యుడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి